Pawan Kalyan : రైస్ శాంపిల్స్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఎమ్మెల్యేపై ఆగ్రహం
- ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన పవన్ కల్యాణ్
- పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్
- మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది
- మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? : డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.6.64 కోట్లుగా అంచనా.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
Also Read
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి చేరిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి, అక్రమ రవాణా పై చర్యలు తీసుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లారు. పిడిఎఫ్ పథకం ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పేదలకు చేరకుండానే విదేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా ఈ రవాణా జరగుతుండటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందా పీక్స్ కి చేరిందని, ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును అడ్డుకుని, భారీ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందిస్తుంటే, అక్రమార్కులు ఆ బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా పోర్టుకు తరలించి, సొంత నౌకల్లో విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో పలు శాఖల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సమస్యను మూలంగా పరిష్కరించాలని కట్టుబడి ఉంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ సీరియస్గా చర్యలు చేపడుతోంది.
S Jaishankar: పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్తో పోల్చిన జైశంకర్
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!