Pawan Kalyan : రైస్ శాంపిల్స్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఎమ్మెల్యేపై ఆగ్రహం
- ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన పవన్ కల్యాణ్
- పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్
- మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది
- మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? : డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.6.64 కోట్లుగా అంచనా.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి చేరిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి, అక్రమ రవాణా పై చర్యలు తీసుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లారు. పిడిఎఫ్ పథకం ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పేదలకు చేరకుండానే విదేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా ఈ రవాణా జరగుతుండటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందా పీక్స్ కి చేరిందని, ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును అడ్డుకుని, భారీ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందిస్తుంటే, అక్రమార్కులు ఆ బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా పోర్టుకు తరలించి, సొంత నౌకల్లో విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో పలు శాఖల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సమస్యను మూలంగా పరిష్కరించాలని కట్టుబడి ఉంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ సీరియస్గా చర్యలు చేపడుతోంది.
S Jaishankar: పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్తో పోల్చిన జైశంకర్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!