Pawan Kalyan : రైస్ శాంపిల్స్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఎమ్మెల్యేపై ఆగ్రహం
- ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన పవన్ కల్యాణ్
- పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్
- మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది
- మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? : డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.6.64 కోట్లుగా అంచనా.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి చేరిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి, అక్రమ రవాణా పై చర్యలు తీసుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లారు. పిడిఎఫ్ పథకం ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పేదలకు చేరకుండానే విదేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా ఈ రవాణా జరగుతుండటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందా పీక్స్ కి చేరిందని, ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును అడ్డుకుని, భారీ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందిస్తుంటే, అక్రమార్కులు ఆ బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా పోర్టుకు తరలించి, సొంత నౌకల్లో విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో పలు శాఖల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సమస్యను మూలంగా పరిష్కరించాలని కట్టుబడి ఉంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ సీరియస్గా చర్యలు చేపడుతోంది.
S Jaishankar: పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్తో పోల్చిన జైశంకర్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!