Pawan Kalyan : రైస్ శాంపిల్స్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఎమ్మెల్యేపై ఆగ్రహం
- ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన పవన్ కల్యాణ్
- పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్
- మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది
- మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? : డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.6.64 కోట్లుగా అంచనా.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి చేరిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి, అక్రమ రవాణా పై చర్యలు తీసుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లారు. పిడిఎఫ్ పథకం ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పేదలకు చేరకుండానే విదేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా ఈ రవాణా జరగుతుండటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందా పీక్స్ కి చేరిందని, ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును అడ్డుకుని, భారీ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందిస్తుంటే, అక్రమార్కులు ఆ బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా పోర్టుకు తరలించి, సొంత నౌకల్లో విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో పలు శాఖల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సమస్యను మూలంగా పరిష్కరించాలని కట్టుబడి ఉంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ సీరియస్గా చర్యలు చేపడుతోంది.
S Jaishankar: పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్తో పోల్చిన జైశంకర్
తాజావార్తలు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!