Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు
- తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తా.. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్పై దృష్టి పెడతాం.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు. మోడీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను కోరారని.. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్పై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్నారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఉందని.. సివిల్ ఏవియేషన్కు బెస్ట్ మోడల్గా ఏపీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఐదేళ్లు పౌర విమానయాన శాఖలో బలమైన పునాదులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
Read Also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
పర్యావరణ అనుకూలంగా తన మంత్రిత్వ శాఖను తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. పర్యావరణ హితంగా తమ శాఖను తీర్చిదిద్దుతామని రామ్మోహన్ చెప్పారు. ఎయిర్ పోర్ట్లకు కావాల్సిన బడ్జెట్ లభిస్తుందన్నారు. 2014లో అశోక్ గజపతి కేంద్ర మంత్రిగా విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహించారని, ఆయన వచ్చాక ఆంధ్రప్రదేశ్లో విమాన యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, ఆయన దార్శనికతతోనే విమానయాన రంగం ముందుకు వెళ్లిందన్నారు. ఉడాన్ స్కీమ్ను అశోక్ గజపతి హయంలోనే ప్రారంభించారని ఎంతోమంది దాని ద్వారా విమానయానం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో మరింత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విమానయానశాఖలో సింధియా అమలు చేసిన సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లుగా వికసిత్ భారత్లో భాగంగా విమానయాన రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఏపీలోని రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అవసరాలను కూడా గుర్తించి వారికి సహకరిస్తామని తెలిపారు. తెలంగాణలో కూడా విమానయానం అవసరాలను తీర్చేందుకు సహకారం అందిస్తామన్నారు.
తాజావార్తలు
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!