Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా త్వరగా పంపిణీ చేయాలి
- ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
- విద్యా కానుక కిట్ల కోసం రూ. 700 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటినీ కూడా పంపిణీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్ధులకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Read Also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు వెచ్చించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవటంతో స్కూలు బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వాస్తవానికి నిన్ననే(బుధవారం) పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో సర్కారు ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పాఠశాలలు తెరచుకున్నాయి. కొన్నేళ్లుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్ధులకు ఈసారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్లు, పేర్లలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?