Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా త్వరగా పంపిణీ చేయాలి
- ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
- విద్యా కానుక కిట్ల కోసం రూ. 700 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
Chandrababu: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటినీ కూడా పంపిణీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్ధులకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Read Also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు వెచ్చించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవటంతో స్కూలు బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వాస్తవానికి నిన్ననే(బుధవారం) పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో సర్కారు ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పాఠశాలలు తెరచుకున్నాయి. కొన్నేళ్లుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్ధులకు ఈసారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్లు, పేర్లలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!