Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా త్వరగా పంపిణీ చేయాలి
- ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
- విద్యా కానుక కిట్ల కోసం రూ. 700 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటినీ కూడా పంపిణీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్ధులకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Read Also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు వెచ్చించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవటంతో స్కూలు బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వాస్తవానికి నిన్ననే(బుధవారం) పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో సర్కారు ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పాఠశాలలు తెరచుకున్నాయి. కొన్నేళ్లుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్ధులకు ఈసారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్లు, పేర్లలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!