DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
- రాజ్యసభలో క్షీణించిన కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం
- అపస్మారక స్థితికి చేరుకున్న రాజ్య సభ ఎంపీ
- అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లిన తోటి ఎంపీలు
- ఈ ఘటనపై బయటకు వచ్చిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోలాహలం మధ్య ఫూలో దేవి ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకుందని సమాచారం. తోటి ఎంపీలు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అంబులెన్స్ లో ఫూలో దేవిని పార్లమెంట్ కాంప్లెక్స్కు తీసుకెళ్లిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ముందు కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఫూలో దేవి నేతమ్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కొండగావ్ నివాసి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఛత్తీస్గఢ్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె 14 సెప్టెంబర్ 2020న కాంగ్రెస్ సభ్యురాలిగా ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత ఏడాది ఆగస్టులో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఫూలో దేవి నేతమ్తో సహా 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ దోషులుగా నిర్ధారించింది. భవిష్యత్తులో ఇలా ప్రవర్తించవద్దని నాడు ఈ సభ్యులను హెచ్చరించారు.
READ MORE: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
కాగా.. పార్లమెంట్ తొలి సమావేశాల్లోనూ విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీక్, ఇతర వివాదాలపై చర్చ కోరుతూ విపక్షాలు ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నీట్ పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!