Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.
ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాలను చూస్తే 97 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు. సభలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్కి 29, తృణమూల్ కాంగ్రెస్కి 13 మంది, డీఎంకే, ఆప్లకు 10 మంది, బీజేడీ, వైఎస్ఆర్సీపీకి 9 మంది, బీఆర్ఎస్కి ఏడుగురు, ఆర్జేడీకి ఆరుగురు, సీపీఎంకి ఐదుగురు, ఏఐడీఎంకే, జేడీయూలకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
Read Also: YSRCP: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్.. పార్టీ బంపర్ ఆఫర్!
మంగళవారం ఎన్నికలు జరిగిన 56 సీట్లలో 41 ఏకగ్రీవం కాగా.. 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 56 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ 30 స్థానాలను దక్కించుకుంది. దీంతో బీజేపీకి మొత్తంగా 97 ఎంపీలు ఉండగా.. ఎన్డీయేకి కలిపి 117 ఎంపీల సంఖ్యా బలం ఉంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. మెజారిటీకి 121 మంది సభ్యులు అవసరం. అయితే, ప్రస్తుతం బీజేపీకి మెజారిటీకి నలుగురు మాత్రమే తక్కువగా ఉన్నారు.
కర్ణాటకలో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. రెండింటిని ఎస్పీ గెలుచుకుంది. నిజానికి బీజేపీకి సొంతగా 7 స్థానాలు గెలుచుకునే అవకాశమే ఉన్నప్పటికీ.. ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో మరో స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని ఏకైక స్థానాన్ని బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలువలేకపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి ఓటేయడంతో కమలం అభ్యర్థి గెలుపొందారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!