Drug Racket Busted: పాన్ మసాలా మాటున డ్రగ్స్ దందా.. అంతర్రాష్ట్ర పెడ్లర్ అరెస్ట్
- పేట్బషీరాబాద్లో భారీగా పట్టుబడిన MDMA, నల్లమందు
- రూ. 15 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్
- ఈగల్ ఫోర్స్, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో బయటపడ్డ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Racket Busted: హైదరాబాద్ (పేట్బషీరాబాద్) నగరంలో నిర్మాణ రంగం, ఇంటీరియర్ డిజైనింగ్ పనుల కోసం రాజస్థాన్ నుండి వలస వచ్చిన కళాకారులే లక్ష్యంగా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్బషీరాబాద్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ఛేదించింది.
పాన్ మసాలాలో కలుపుకుని..
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ మరియు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చిన చాలా మంది కళాకారులు (Artisans) మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వీరు ఎండీఎంఏ (MDMA), నల్లమందు (Opium) వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను పాన్ మసాలాలలో కలుపుకుని సేవించడం పరిపాటిగా మారింది. సొంత ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ను తీసుకువచ్చి, తోటి రాజస్థానీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
Drugs Party: గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 12 మంది అరెస్ట్..!
నెల రోజులుగా నిఘా..
పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. గత ఒక నెల రోజులుగా నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాయి. ఈ సంయుక్త ఆపరేషన్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు.
రూ. 15 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్:
రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న రాజేందర్ @ రాజు భాకర్ (31) అనే ఇంటీరియర్ డిజైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి వాణిజ్య పరిమాణానికి (commercial quantity) 20 రెట్లు ఎక్కువగా ఉన్న 200 గ్రాముల MDMA మరియు 60 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని అంచనా.
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!
నిందితుడు రాజేందర్ 8వ తరగతి మధ్యలోనే మానేసి హైదరాబాద్ వచ్చి కార్పెంటర్, ఇంటీరియర్ డిజైనర్గా స్థిరపడ్డాడు. మత్తుకు బానిసైన ఇతను, ఇక్కడ డిమాండ్ పెరగడాన్ని గమనించి.. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన సప్లయర్లు ధన్రాజ్, అనిల్, ముఖేష్ల నుంచి డ్రగ్స్ సేకరించి నగరానికి తెచ్చేవాడు. ఇక్కడ గ్రాముకు రూ. 5000 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రధాన సప్లయర్లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న పలువురు వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
-
Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
-
MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
-
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!