Ganjai : గంజాయి, డ్రగ్స్పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు.…
Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో,…
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్కు ప్రత్యేక…
Ganja Smuggling : షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది.. తీగ లాగితే డొంక కదిలినట్టు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ అయిన గంజాయిని బయటికి తీసి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దీనిని తన బంధువు ద్వారా విక్రయించేతువు తీసుకు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4వ తేదీన పట్టణంలోని ఫరూక్ నగర్ యాదవ…
డ్రగ్స్ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది..
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Stuart MacGill: మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్గిల్ (Stuart MacGill) దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ…
గంజాయి డాన్ అంగూరు భాయ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్పేట్ సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్లో స్థిరపడి.. గంజాయి డాన్గా ఎదిగిన అంగూర్ భాయ్పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ…
DCP Vineeth : అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్ ను TGANB, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కు చెందిన శతాబ్ది మన్నా ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీ ఉన్నాడు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న…