ఐపీఎల్-2024లో రాజస్థాన్ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ (71*; 33 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (52*; 34 బంతుల్లో) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (34), జైస్వా్ల్ (24) రాణించారు. లఖ్నవూ బౌలర్లలో యశ్ ఠాకూర్ 1, మార్కస్ స్టాయినిస్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76), దీపక్ హూడా (50) రాణించారు. సందీప్ శర్మ 2, బౌల్ట్ 1, అవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ జట్టుకు మొదట అద్భుత ఆరంభం లభించింది. కానీ ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు. దీంతో ఈజీగా 200 దాటుతుందని అనుకున్న స్కోరు 196కే ఆగిపోయింది.
ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గత మ్యాచ్ సెంచరీ వీరుడు స్టోయినీస్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లోకి వెళ్లింది లఖ్నవూ. అనంతరం కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 76 పరుగులు చేశాడు. అతడికి రాహుల్ హుడా (31 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు) మంచి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లలోనే లఖ్నవూ 126 స్కోరు దాటింది.
అయితే క్రీజులో కుదురుకున్న హుడా, రాహుల్ తర్వాత ఔట్ అయిపోయారు. దీంతో స్కోరు నెమ్మదించింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు చురుగ్గా బంతులు సంధించారు. పూరన్(11), ఆయుష్ బదోని(18 నాటౌట్), కృనాల్ పాండ్య(15 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 196 పరుగుల దగ్గర లఖ్నవూ ఇన్నింగ్స్ ముగించింది. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్ట్ , అవేశ్ ఖాన్, అశ్విన్ తలో వికెట్ తీశారు.