YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!
- అదానీ కేసుల వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్..
- అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదు..
- సీఎంలను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు..
- ఐదేళ్ల కాలంలో అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన జగన్..
- అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్..
- తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివరణ ఇచ్చారు.. తాము ప్రభుత్వానికి ఆదాయం పెంచామని.. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఆదాయాన్ని ఆవిరిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. ఇక, ఇదే సమయంలో.. అదానీ కేసుల వ్యవహారంపై స్పందించారు.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు వైఎస్ జగన్..
Read Also: YS Jagan: ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్ జగన్.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వ, సేకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి.. మూడో వ్యక్తి లేరని స్పష్టం చేశారు.. అయితే, తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: Health Tips: వాయు కాలుష్యంతో పోరాడే 4 రకాల టీలు.. వీటితో శ్వాసకోశ సమస్యలకు చెక్
ఇక, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. దానిని పక్కన పెడితే మీరు నన్ను ఏమనేవారు? అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్నది ధర్మేనా? అని నిలదీశారు.. ఇంత చవకైన ధరకు ఇంతకు ముందు ఎన్నడూ విద్యుత్ కొనుగోలు జరగలేదన్నారు వైఎస్ జగన్.. చంద్రబాబు హయాంలో 20214-19 మధ్య 133 పీపీఏలు చేశారు.. విండ్ పీపీఏలు యూనిట్కు రూ.4.80 చేసుకున్నారు.. ఇక, సోలార్ విద్యుత్ అయితే యూనిట్కు రూ.6.99 వరకు ఒప్పందాలు చేసుకున్నారని.. విండ్ పవన్ యావరేజ్ రూ.4.63కు యూనిట్ కొనుగోలు చేశారు.. సోలార్ పవర్ యావరేజ్ రూ.5.90కు యూనిట్ కొనుగోలు చేశారని చెప్పుకొచ్చిన జగన్.. కేంద్రం అంత మంచి ఆఫర్ ఇస్తే స్పందించిన నేను మంచోడినా..? అంత దిక్కుమాలని ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు సోలార్ ఒప్పందాల వల్ల ఏడాదికి రూ.2 వేల కోట్ల అదనపు భారం.. 25 ఏళ్లకు అంటే రూ.50వేల కోట్లు అదనపు భారం అవుతుందనిన్నారు.. మేం లక్ష కోట్లు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు 80 వేల కోట్లు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!