Rahul Gandhi: మళ్లీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను”మెంబర్ ఆఫ్ పార్లమెంట్”గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత రాహుల్గాంధీ బయో గతంలో “డిస్ క్వాలిఫైడ్ ఎంపీ” అని ఉండేది. రాహుల్గాంధీ సోమవారం ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం స్టేతో లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత తొలిసారిగా రాహుల్గాంధీ లోక్సభలో అడుగుపెట్టారు. లోక్సభలోకి వచ్చే ముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే!
Also Read
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు మాటలు మంచి అభిరుచితో లేవని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొందిం. శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని.. తుది తీర్పు పెండింగ్లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలని బెంచ్ పేర్కొంది. అనర్హత వేటు వేయడమనేది ప్రజలపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది.
ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. అయితే, శిక్షాకాలం ఒక్కరోజు తక్కువగా ఉండి ఉంటే, ఆయన ఎంపీగా అనర్హత వేటు పడేవారు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రేపు లోక్సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కీలక వక్తగా ఉంటారని కాంగ్రెస్ తెలిపింది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!