Rahul Gandhi: మళ్లీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను”మెంబర్ ఆఫ్ పార్లమెంట్”గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత రాహుల్గాంధీ బయో గతంలో “డిస్ క్వాలిఫైడ్ ఎంపీ” అని ఉండేది. రాహుల్గాంధీ సోమవారం ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం స్టేతో లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత తొలిసారిగా రాహుల్గాంధీ లోక్సభలో అడుగుపెట్టారు. లోక్సభలోకి వచ్చే ముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే!
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు మాటలు మంచి అభిరుచితో లేవని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొందిం. శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని.. తుది తీర్పు పెండింగ్లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలని బెంచ్ పేర్కొంది. అనర్హత వేటు వేయడమనేది ప్రజలపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది.
ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. అయితే, శిక్షాకాలం ఒక్కరోజు తక్కువగా ఉండి ఉంటే, ఆయన ఎంపీగా అనర్హత వేటు పడేవారు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రేపు లోక్సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కీలక వక్తగా ఉంటారని కాంగ్రెస్ తెలిపింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!