Jagga Reddy : వాస్తవాలు ప్రశ్నిస్తే.. విమర్శల వేడి ఎందుకు..? కేంద్రంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీపై విమర్శలు కాకుండా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
- పాకిస్తాన్ మిలిటెంట్ దాడిపై మోడీ మౌనం ఎందుకు?
- ట్రంప్ ప్రకటించగానే యుద్ధం ఆగిపోవడమేంటి? : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్లోని పార్క్లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోదీ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, బీజేపీ నేతలు విమర్శలకు పాల్పడటం దుర్మార్గమని చెప్పారు.
Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “మీరు నిద్రలో ఉండి విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం,” అంటూ హెచ్చరించారు. “తప్పులు మీరు చేస్తే, ప్రతిపక్ష నాయకుడిపై నింద వేయడం సరికాదు,” అని స్పష్టం చేశారు.
పాకిస్తాన్తో తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో దేశ ప్రజలు ప్రధానమంత్రి మోడీ యుద్ధం చేస్తారని భావించారని జగ్గారెడ్డి అన్నారు. కానీ అకస్మాత్తుగా యుద్ధం ఆగిపోయిందని, ఈ ప్రకటనను మోదీ కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయడం విచారకరమని మండిపడ్డారు. “దేశప్రజలకి యుద్ధం ఆగిందని మోదీ చెప్పాల్సినప్పుడు ట్రంప్ చెప్పడమేంటో?” అంటూ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో అమెరికా జోక్యాన్ని ఎలా తిరస్కరించిందో గుర్తు చేశారు.
వాజ్పాయి జన్మదినం రోజున ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లడం, అక్కడ నవాజ్ షరీఫ్ తల్లి కాళ్లను మొక్కడం వంటి సంఘటనలను జగ్గారెడ్డి గుర్తుచేశారు. “ఇలాంటి సమయంలో మేమేంటన్నట్లు రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం సరైంది కాదు,” అని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాహుల్ గాంధీ వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, లేకపోతే విమర్శలు చేయడం మానుకోవాలి. వాస్తవాలు వెలికి తీయడమే కాంగ్రెస్ బాధ్యత. దాన్ని తప్పుగా చిత్రీకరించబోద్దని ఆయన వ్యాఖ్యానించారు.
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కలెక్టర్ అంబేద్కర్ ఫైర్..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?