Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
- వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం..
- గత ఏడాది ఎక్స్ గ్రేషియా పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ..
- డెత్ సర్టిఫికేట్, పోస్ట్మార్టం, ఎఫ్.ఐ.ఆర్ రిపోర్టులు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (SDMA) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పరిహారం పొందేందుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన లేక చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి.
Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Also Read
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
ఏం చేయాలి..?
వడదెబ్బ మరణాలను ధ్రువీకరించడానికి ప్రతి మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, వైద్యాధికారి, సబ్ ఇన్స్పెక్టర్ (SI) సభ్యులుగా ఉంటారు. మరణం సంభవించిన వెంటనే ఈ కమిటీకి సమాచారం అందించాల్సి ఉంటుంది.
వ్యక్తి వడదెబ్బతోనే మృతి చెందినట్లు తొలుత వైద్యాధికారి ధ్రువీకరించాలి. తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బ మరణాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి మృతదేహానికి తప్పనిసరిగా పోస్ట్మార్టం నిర్వహించాలి. ఈ నివేదిక పరిహారానికి అత్యంత కీలకంగా ఉంటుంది.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ సిద్ధం చేస్తారు. డెత్ సర్టిఫికేట్, పోస్ట్మార్టం రిపోర్ట్, ఎఫ్.ఐ.ఆర్, పంచనామా రిపోర్టులను జతచేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మండల కమిటీ పంపిన నివేదికను ఆర్డీఓ (RDO) , జిల్లా కలెక్టర్ పరిశీలించి.. మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తారు.
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?