Kavitha : ఇళ్లను కూల్చివేసిన నాయకులకు ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది
- వెలుగుమట్లలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కవిత
- రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వంపై విమర్శలు
- ఆడబిడ్డల బాధ చూసి కవిత ఆవేదన
- పేద ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలుగుమట్ల ప్రాంతంలో రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల దీనస్థితిని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం , స్థానిక నాయకుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. చిన్న పిల్లలు, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయనే కనీస మానవత్వం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని కవిత మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన బుల్డోజర్లు పేదవాడి సొంతింటి కలను ఛిన్నాభిన్నం చేశాయని, విద్యార్థుల పుస్తకాలతో సహా సామాన్లన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ఆడబిడ్డలు, చిన్న పిల్లలు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
8.12 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
“ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదు.. అలాంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చూస్తుంటే కడుపు తరిగిపోతోంది” అని కవిత వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇళ్లను కూల్చివేసిన నాయకులకు, ఈ ప్రభుత్వానికి బాధితుల శాపం కచ్చితంగా తగులుతుందని ఆమె హెచ్చరించారు. పేదవాడి ఆవేదనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సూచించారు. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న కొందరు నాయకులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇది పేదవాడి జీవిత కాలపు ఆవేదన అని, కానీ కొందరు నాయకులకు ఇది ఎగ్జిబిషన్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
కేవలం పర్యటనలు చేసి వెళ్లే టూరిస్టుల్లా కాకుండా, బాధితులకు నిజమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే ఉంటానని బాధితులకు కవిత భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తన ఆడబిడ్డల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!