Kavitha : ఇళ్లను కూల్చివేసిన నాయకులకు ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది
- వెలుగుమట్లలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కవిత
- రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వంపై విమర్శలు
- ఆడబిడ్డల బాధ చూసి కవిత ఆవేదన
- పేద ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలుగుమట్ల ప్రాంతంలో రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల దీనస్థితిని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం , స్థానిక నాయకుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. చిన్న పిల్లలు, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయనే కనీస మానవత్వం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని కవిత మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన బుల్డోజర్లు పేదవాడి సొంతింటి కలను ఛిన్నాభిన్నం చేశాయని, విద్యార్థుల పుస్తకాలతో సహా సామాన్లన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ఆడబిడ్డలు, చిన్న పిల్లలు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
8.12 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
“ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదు.. అలాంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చూస్తుంటే కడుపు తరిగిపోతోంది” అని కవిత వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇళ్లను కూల్చివేసిన నాయకులకు, ఈ ప్రభుత్వానికి బాధితుల శాపం కచ్చితంగా తగులుతుందని ఆమె హెచ్చరించారు. పేదవాడి ఆవేదనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సూచించారు. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న కొందరు నాయకులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇది పేదవాడి జీవిత కాలపు ఆవేదన అని, కానీ కొందరు నాయకులకు ఇది ఎగ్జిబిషన్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
కేవలం పర్యటనలు చేసి వెళ్లే టూరిస్టుల్లా కాకుండా, బాధితులకు నిజమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే ఉంటానని బాధితులకు కవిత భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తన ఆడబిడ్డల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!