Rahul Gandhi: హర్యానా ఓటర్ జాబితాలో బ్రెజిలియన్ మోడల్..? ఈసీని నిలదీసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో ఓట్ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.
READ MORE: Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!
Also Read
రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఒక యువతి ఫోటోను చూపించారు. ఈ యువతి 22 సార్లు ఓటు వేసిందన్నారు. కొన్నిసార్లు సీమ పేరుతో మరి కొన్ని సార్లు సరస్వతి పేరుతో ఓట్లు వేసినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ఈమె ఓ బ్రెజిలియన్ మహిళ అని.. హర్యానా ఓటర్ల జాబితాలో ఏం చేస్తుందని నిలదీశారు. బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్ సీమా.. స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లతో ఓటర్ల జాబితాలో అనేకసార్లు కనిపించిందని రాహుల్గాంధీ వివరించారు. ఆమె 22 సార్లు ఓట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం.. హర్యానాలో ఐదు కేటగిరీల్లో 25 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయని ఆరోపించారు. 5 లక్షల 21 వేలకు పైగా నకిలీ ఓటర్లు దొరికారని చెప్పారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయి. అంటే ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని అర్థం. దీని కారణంగా, కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..