Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
- మసీదులో ‘‘జైశ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
- కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..
- నిందితులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కోర్టు రద్దు చేసింది.
దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కీర్తన్ కుమార్, సచిన్ కుమార్లపై క్రిమినల్ కేసుల్ని రద్దు చేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్న గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్లు 295 A, 447, 506లతో సహా పలు సెక్షన్ల కింద స్థానిక పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ఇద్దరు గతేడాది సెప్టెంబర్లో రాత్రి స్థానిక మసీదులోకి ప్రవేశించి జైశ్రీరాం అని అరిచారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
‘‘సెక్షన్ 295ఏ ఉద్దేశపూర్వకంగా, హనికరమైన చర్యలను ద్వారా మతాల భావాల దెబ్బతీయడం గురించి చెబుతుంది. ఎవరైనా జై శ్రీరాం అని కేకలు వేస్తే అది ఏ వర్గానికి చెందిన వారి మత భావాలను ఎలా రెచ్చగొడుతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో హిందూ-ముస్లింలు సామరస్యపూర్వకంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారు స్వయంగా పేర్కొన్నప్పుడు, ఈ సంఘటన ఎంతమాత్రం విరోధానికి దారితీయదు’’ అని హైకోర్టు పేర్కొంది.
పిటిషనర్ తరుపు న్యాయవాది వాదిస్తూ.. మసీద్ పబ్లిక్ ప్లేస్ అని, అందువల్ల క్రిమినల్ అతిక్రమణ కేసు ఉండదని వాదించారు. అంతేకాకుండా, జైశ్రీరాం అని అరవడం ఐపీసీ సెక్షన్ 295ఏ కింద నిర్వచించిన నేరం కిందకు రాదని కోర్టుకు చెప్పారు. అయితే, రాష్ట్రప్రభుత్వం ఈ పిటిషన్ని వ్యతిరేకిస్తూ ఈ విషయంపై తదుపరి విచారణ అవసరమని చెప్పింది.ఈ కేసు పబ్లిక్ ఆర్డర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని కోర్టు పేర్కొంది.
‘‘IPC సెక్షన్ 295A ప్రకారం ఏదైనా ప్రతీ చర్య నేరంగా మారదని సుప్రీంకోర్టు పేర్కొంది. పబ్లిక్ ఆర్డర్పై ఎలాంటి విధ్వంసం చూపని చర్యలు ఐసీసీ సెక్షన్ 295A ప్రకారం నేరానికి దారితీయవు. ఇలాంటి నేరాల్లో ఏ విధమైన ప్రతికూల ఫలితాలు లేనప్పుడు, ఈ పిటిషన్లపై తదుపరి చర్యలను అనుమతించడం అనేది చట్టం ప్రక్రియని దుర్వినియోగం చేయడం, న్యాయ దుర్వినియోగానికి దారి తీస్తుంది’’ అని కోర్టు పేర్కొంది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సచిన్ బిఎస్ వాదనలు వినిపించారు. రాష్ట్రప్రభుత్వం తరుపున హెచ్సీజీపీ సౌమ్య ఆర్ హాజరయ్యారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!