R Ashwin: ఎంఎస్ ధోనీ కంటే అతడే తెలివైన కెప్టెన్: అశ్విన్
- రోహిత్ శర్మనే బెస్ట్
- ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడు
- వ్యూహాత్మకంగా రోహిత్ బలవంతుడు
R Ashwin Praises Rohit Sharma Captaincy: వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ కంటే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మనే బెస్ట్ అని వెటరన్ అఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ముగ్గరిలో సారథిగా వ్యూహాత్మకంగా రోహిత్ వ్యవహరిస్తాడని యాష్ పేర్కొన్నాడు. హిట్మ్యాన్ జట్టు వాతావరణాన్ని ఎంతో తేలికగా ఉంచుతాడని, ఓ ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడన్నాడు. గత రెండు దశాబ్దాలుగా ధోనీ, కోహ్లీ, రోహిత్లు భారత జట్టుకు సారథులుగా ఉన్నారు. ఈ ముగ్గురి కెప్టెన్సీలో అశ్విన్ ఆడాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2-3 విషయాలు అద్భుతం. హిట్మ్యాన్ సారథ్యంలో జట్టు వాతావరణం చాలా బాగుంటుంది. వ్యూహాత్మకంగా రోహిత్ ఎంతో బలవంతుడు. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా బలవంతులే కానీ.. రోహిత్ కాస్త ముందుంటాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే.. ఎనలిటిక్స్ టీమ్, కోచ్లతో కలిసి రోహిత్ ప్రణాళికలు రూపొందిస్తాడు. బ్యాటర్ బలహీనత ఏంటి, బౌలర్కు ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చర్చిస్తాడు. అదే అతని బలం. ప్లేయర్లకు 100 శాతం మద్దతుగా ఉంటాడు. నా కెరీర్ మొత్తం ఈ ముగ్గురు కెప్టెన్సీలోనే ఆడాను’ అని చెప్పాడు.
Also Read
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
Also Read: 3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!
ఆర్ అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరఫున 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన యాష్.. టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. ఎంఎస్ ధోనీ 2007 నుంచి 2018 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. మూడు ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా.. 178 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. 2013 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 213 మ్యాచ్ల్లో 135 విజయాలు అందుకుంది. 2022లో పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ భారత జట్టుకు 126 మ్యాచ్ల్లో 93 గెలిచింది.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!