R Ashwin: ఎంఎస్ ధోనీ కంటే అతడే తెలివైన కెప్టెన్: అశ్విన్
- రోహిత్ శర్మనే బెస్ట్
- ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడు
- వ్యూహాత్మకంగా రోహిత్ బలవంతుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin Praises Rohit Sharma Captaincy: వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ కంటే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మనే బెస్ట్ అని వెటరన్ అఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ముగ్గరిలో సారథిగా వ్యూహాత్మకంగా రోహిత్ వ్యవహరిస్తాడని యాష్ పేర్కొన్నాడు. హిట్మ్యాన్ జట్టు వాతావరణాన్ని ఎంతో తేలికగా ఉంచుతాడని, ఓ ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడన్నాడు. గత రెండు దశాబ్దాలుగా ధోనీ, కోహ్లీ, రోహిత్లు భారత జట్టుకు సారథులుగా ఉన్నారు. ఈ ముగ్గురి కెప్టెన్సీలో అశ్విన్ ఆడాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2-3 విషయాలు అద్భుతం. హిట్మ్యాన్ సారథ్యంలో జట్టు వాతావరణం చాలా బాగుంటుంది. వ్యూహాత్మకంగా రోహిత్ ఎంతో బలవంతుడు. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా బలవంతులే కానీ.. రోహిత్ కాస్త ముందుంటాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే.. ఎనలిటిక్స్ టీమ్, కోచ్లతో కలిసి రోహిత్ ప్రణాళికలు రూపొందిస్తాడు. బ్యాటర్ బలహీనత ఏంటి, బౌలర్కు ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చర్చిస్తాడు. అదే అతని బలం. ప్లేయర్లకు 100 శాతం మద్దతుగా ఉంటాడు. నా కెరీర్ మొత్తం ఈ ముగ్గురు కెప్టెన్సీలోనే ఆడాను’ అని చెప్పాడు.
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
Also Read: 3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!
ఆర్ అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరఫున 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన యాష్.. టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. ఎంఎస్ ధోనీ 2007 నుంచి 2018 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. మూడు ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా.. 178 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. 2013 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 213 మ్యాచ్ల్లో 135 విజయాలు అందుకుంది. 2022లో పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ భారత జట్టుకు 126 మ్యాచ్ల్లో 93 గెలిచింది.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!