3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!
- 3500 ఏళ్ల నాటి మట్టి కూజా ముక్కలు
- బాలుడిని పల్లెత్తు మాట అనని సిబ్బంది
- బాలుడికి మరోసారి ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ariel Geller Visits Hecht Museum 2nd Time: ఇటీవల ఇజ్రాయెల్లోని హైఫా యూనివర్సిటీలో ఉన్న హెక్ట్ మ్యూజియంలోని 3500 ఏళ్ల నాటి మట్టి కూజా ముక్కలైన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలుడు ఏరియల్ గెలర్ తన తల్లిదండ్రులతో మ్యూజియంకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ అతి పురాతన కూజాను కిందదేశాడు. ఈ ఘటన అనంతరం సిబ్బంది ఏమంటారో అని బాలుడితో సహా అతడి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు. అయితే 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియం సిబ్బంది ఆ బాలుడిని కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతేకాదు మ్యూజియంకు చూసేందుకు మరోసారి ఆహ్యానించారు.
కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను ఏరియల్ గెలర్ సరిగా చూడలేదని భావించిన సిబ్బంది.. ఆ బాలుడిని మరోసారి ఆహ్యానించారు. ఆహ్వానం మేరకు గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు గెలర్ మ్యూజియంకు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను మ్యూజియానికి ఆ బాలుడు బహుమతిగా ఇచ్చాడు. గెలర్ మనోభావాలను గౌరవిస్తూ ఆనందంగా ఆ కూజాను సిబ్బంది స్వీకరించారు. ఆపై బాలునితో చాలాసేపు సరదాగా గడిపారు. పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో గెలర్కు ప్రత్యక్షంగా చూపించారు. బాలుడి పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్గా మారింది.
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Also Read: Gold Rate Today: గుడ్న్యూస్.. నేటి బంగారం, వెండి రేట్స్ ఇవే!
పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారని, వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుంటుందని రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ తెలిపారు. పురాతన వస్తువులు సందర్శనకు వచ్చే వారి చేతికందేంత సమీపంలోనే ఉండాలని, అద్దాల్లో ఉండకూడదని తన అభిప్రాయం అని చెప్పారు. పురాతన వస్తువులను తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శాస్త్రాల పట్ల పిల్లలకు ఆస్తకి పుట్టవచ్చు అని షెఫర్ చెప్పుకొచ్చారు. గెలర్ తల్లిదండ్రులు మ్యూజియం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడు పురాతన కూజాను పగలగొట్టినా ఏమీ అనలేదని, మరలా తమకు ఆహ్వానం పలికారని గెలర్ తండ్రి అలెక్స్ తెలిపారు. నరకప్రాయంగా మారాల్సిన ఈ ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!