PM Modi: భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం.. రాహుల్పై ప్రధాని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. “ఈ వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ ప్రజలను అవమానిస్తున్నారు. అలాంటి వారికి కర్ణాటక దూరంగా ఉండాలి.” అని ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యయనం చేస్తోందని, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి అని మనం చెప్పగలమని.. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తి ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా చర్చనీయాంశంగా మారాయి. పదేపదే ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన దేశ విదేశాల్లో పరువు తీశారని బీజేపీ ఆరోపించింది.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ అప్రతిష్టపాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు.
గతవారం ఇండియన్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, ”స్వాతంత్య్రం వచ్చిన 60 లేదా 70 ఏళ్లలో ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి ప్రకటించడం నాకు గుర్తుంది.భారతదేశంలో అపరిమిత అవినీతి ఉందని.. విదేశాల్లో ఇలా మాట్లాడడం నాకు గుర్తుంది.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ప్రతి భారతీయుడిని అవమానిస్తూ ఆయన ప్రసంగం మీరు వినలేదా.” అంటూ రాహుల్ గాంధీ అన్నారు. తానెప్పుడూ దేశ పరువు తీయలేదన్నారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!