Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: భారతదేశ విదేశాంగ విధానానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు ప్రకటించారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి ప్రయత్నాలు అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయే తప్ప ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో గురువారం ప్రపంచవ్యాప్త ప్రముఖ వార్తా సంస్థల అధిపతులతో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను రష్యా ఎల్లప్పుడూ ఒక అత్యంత నమ్మకమైన భాగస్వామిగా చూస్తుందని, అమెరికాతో సహా ఇతర దేశాలతో భారత్ పెంచుకుంటున్న సంబంధాలను తాము తమ ద్వైపాక్షిక బంధానికి ముప్పుగా భావించడం లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావడం అనేది అటు అంతర్జాతీయ సంబంధాలకు, ఇటు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక బంధాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఇప్పటికే ప్రతి ఒక్కరికీ అర్థమైందని పుతిన్ వ్యాఖ్యానించారు.
రష్యా నుంచి భారత్ ముడి చమురు (క్రూడ్ ఆయిల్) కొనుగోలు చేయడంపై డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఒత్తిడిని పెంచుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని నిర్దిష్ట రంగాలలో.. ముఖ్యంగా రష్యాతో సహకారానికి సంబంధించి భారత్ను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ బాహ్య ఒత్తిళ్లు ఏవీ మాస్కో, న్యూఢిల్లీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తోందనేది తమకు అనవసరమని, దీనివల్ల తమ సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీతో రష్యాకు ఉన్న బంధంపై తమకు పూర్తి నమ్మకం ఉందని పుతిన్ పునరుద్ఘాటించారు.
Also Read
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
భారత్-రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా 100 బిలియన్ డాలర్లకు (లక్ష మిలియన్ డాలర్లు) చేరుకుంటుందనే పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాలలో భారత్ రష్యాతో నిరంతరం కొనసాగిస్తున్న భాగస్వామ్యంపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, భారత్ ఒక గొప్ప దేశమని, ఒక బలమైన ప్రజాస్వామ్య దేశమని పుతిన్ కొనియాడారు. భారతదేశం ఎల్లప్పుడూ తన సొంత జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ దిశగానే స్థిరంగా ముందడుగు వేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
-
Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
-
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!