Pushkar Singh Dhami: ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవైపు జీ-20కి ప్రస్తుత అధ్యక్షుడిగా భారత్ ఈసారి దీనిని నిర్వహిస్తోంది. మరోవైపు ‘ఇండియా’, ‘భారత్’ అనే పదాల విషయంలో దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాసి ఉంది.
Reaad Also: MP Margani Bharat: చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామర్
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ఒకవైపు ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని ఉపయోగించడంపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీకి చెందిన చాలా మంది నాయకులు ‘భారత్’ అనే పదానికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ‘భారత రాష్ట్రపతి’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.
Reaad Also: Weight loss Drinks: ఈ పానీయాలు తాగండి.. బరువు తగ్గండి
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి X (ట్విట్టర్)లో ‘బానిసత్వపు మనస్తత్వానికి మరో లోతైన దెబ్బ. G20 సమ్మిట్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు ఆహ్వాన పత్రంపై “ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని రాయడం దేశంలోని ప్రతి ఒక్కరికి గర్వకారణం. భారత్ మాతా కీ జై!’ అని రాశారు.
Reaad Also: Kalki2898AD: కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్
ఒకవైపు బీజేపీ నేతలు ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు దీనిపై బీజేపీని టార్గెట్ చేస్తూ రాజ్యాంగాన్ని మార్చేందుకు కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. ఆహ్వాన పత్రికపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ.. ‘భారత రాష్ట్రపతి’ అంటూ ‘రాజ్యాంగాన్ని మార్చేంత వరకు వెళ్తారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు చిరాకు తెస్తోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.
गुलामी की मानसिकता पर एक और गहरी चोट..
G20 समिट के दौरान राष्ट्रपति भवन में आयोजित होने वाले रात्रि भोज के निमंत्रण पत्र पर "The President of Bharat" लिखा जाना प्रत्येक देशवासी के लिए गौरव का क्षण है।
भारत माता की जय ! pic.twitter.com/IdAgHGRt36
— Pushkar Singh Dhami (@pushkardhami) September 5, 2023
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!