ఏలూరు జిల్లాలో పూళ్ళ గ్రామంలో దెబ్బ తిన్న పంట పొలాలను ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. నీట మునిగిన వరి చేలల్లో దిగి రైతులను పంట నష్టం గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.. కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.. రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరనికి 50 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
Read Also: Earthquake : తమిళనాడు, కర్ణాటకల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అయితే, తడిచిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. రైతులకు గోనె సంచులు సైతం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పరిస్థితి.. రైతు భరోసా కేంద్రాలు నామ మాత్రంగా ఉన్నాయి.. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టని నేపథ్యంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అని ఆమె మండిపడ్డారు.