Pulwama Attack: పుల్వామా సైనికుల త్యాగానికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం నివాళులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulwama Attack: 2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు. అమరవీరులను స్మరించుకుంటూ దేశం వారికి నివాళులర్పిస్తోంది. పుల్వామా దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే సారి 40 మంది వీరసైనికులు భరతమతా ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకోవడంతో దేశమంతా ఆవేశంతో ఊగిపోయింది. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.
దేశంలో ప్రతి సంవత్సరం ఈ దాడిని ఖండిస్తూ పుల్వామా దాడి ఘటన మన దేశానికి చీకటి రోజంటూ అమరవీరులకు నేడు నివాళులర్పిస్తోంది. పాకిస్తానీ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన అమరజవానుల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని.. వారి సేవలను దేశం స్మరించుకుంటోంది. వారికి దేశప్రజలు ఘననివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటన పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన దాడిని ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాలిపోయిన మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణహోమం జరిగిన ప్రాంతం.. హృదయాన్ని కదిలించే దృశ్యాలు అన్ని వార్తలలో నిలిచాయి.
Also Read
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
Punishment: మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్
ఈ దాడికి బాధ్యత వహిస్తూ జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. పుల్వామా జిల్లాలోని లెత్పోరా వద్ద 22 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్గా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను కాన్వాయ్లోకి ఎక్కించాడు. అతను కాశ్మీర్ నివాసి, కుటుంబం ప్రకారం, 2018లో అదృశ్యమయ్యాడు. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఫిబ్రవరి 15, 2019న, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడికి పాకిస్తాన్పై ఆరోపణలు చేసింది, అయితే పాకిస్తాన్ అలాంటి ఆరోపణలన్నింటినీ ఖండించింది. భారత ప్రభుత్వం వరుస సమావేశాల తర్వాత, పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ప్రతీకార జ్వాలల్లో ఊగిపోయింది. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.12 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని కూడా భారత్ 200 శాతానికి పెంచింది. అంతేకాకుండా, మనీలాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)ని తన ‘బ్లాక్లిస్ట్’లో చేర్చాలని భారతదేశం కూడా కోరింది. అందుకే, అది FATF యొక్క ‘గ్రే లిస్ట్’లో స్థానం పొందింది. ఫిబ్రవరి 18, 2019 తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. మరోవైపు జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలు ఆంక్షలు విధించారు.
New Zealand: న్యూజిలాండ్లో భీకర తుఫాను.. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం
తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 2019 న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ దళాలు తెలిపాయి. ప్రతీకారంగా, పాకిస్తాన్ కూడా మరుసటి రోజు వైమానిక దాడులను ప్రారంభించింది.. ఆ సమయంలో మిగ్-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్కు చెందిన PAF F-16ని కూల్చివేశాడు. ఈ సమయంలో వింగ్ కమాండర్ వర్థమాన్ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యాడు. అభినందన్ను పాకిస్తాన్ సైన్యం స్వాధీనంలోకి తీసుకుంది. మార్చి 1, 2019 రాత్రి విడుదల చేయబడ్డాడు. అభినందన్ వర్థమాన్ చూపిన ధైర్య సాహసాలకు గాను దేశంలోని మూడో అత్యున్నత శౌర్య పురస్కారం వీర్ చక్రను ప్రదానం చేశారు.
తాజావార్తలు
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!