Bade Chokkarao : బడే చొక్కారావు బ్రతికే ఉన్నాడు.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
- దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల ఎన్కౌంటర్
- ఈ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ ప్రకటన
- ఈ ఎన్కౌంటర్లో దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందలేదని వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bade Chokkarao : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, మావోయిస్టు పార్టీ ఈ ప్రచారాన్ని ఖండించింది. దామోదర్ మృతిచెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖను సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించింది. పోలీసులు కావాలనే బూటకపు లేఖలు తయారు చేసి, ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్కౌంటర్లో మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు లేఖలో పేర్కొంది. వారిలో నలుగురు మావోయిస్టులు, మిగతా నలుగురు గ్రామస్తులని వెల్లడించింది. పోలీసులు అనవసరంగా గ్రామాల్లోకి చొరబడి, అమాయక ప్రజలను బెదిరించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించింది.
Also Read
- Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం.. భారత్కు పెరుగుతున్న పతకాల సంఖ్య..
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Masala Aloo Fries Recipe: మార్కెట్ ఫ్రెంచ్ ఫ్రైస్కు గుడ్బై.. ఇంట్లోనే కరకరలాడే మసాలా ఆలూ ఫ్రైస్!
మావోయిస్టు పార్టీ ప్రకటనలో “ఆపరేషన్ కగార్” పేరిట కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండించింది. జనవరి 16, 17 తేదీల్లో దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు చుట్టుపక్కల నాలుగు గ్రామాలపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ దాడుల సమయంలో భద్రతా బలగాలు అమాయక గ్రామస్థులను టార్గెట్ చేసి, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దామోదర్ తన సహచరులతో ఇటీవల ఫోలన్ ద్వారా మాట్లాడినట్లు తెలిపిన మావోయిస్టు పార్టీ, తాను క్షేమంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారని పేర్కొంది. కాగా, ఈ విషయంపై ఏబీఎన్ ఛానెల్ మొదట వార్తలు ప్రసారం చేసినట్లు గుర్తు చేసింది.
మరోవైపు, భద్రతా బలగాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనవసర ఒత్తిడి సృష్టిస్తున్నాయని, ఇది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో అభిప్రాయపడింది. పోలీసుల ప్రకటనలన్నీ బూటకపు ప్రకటనలేనని, నిజాలను మలుపుతిప్పి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
మొత్తంగా, పూజార్ కంకేర్ ఎన్కౌంటర్కు సంబంధించిన భద్రతా బలగాల చర్యలపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ నాయకుడు దామోదర్ భద్రంగా ఉన్నారని, ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం.. భారత్కు పెరుగుతున్న పతకాల సంఖ్య..
-
Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
-
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Masala Aloo Fries Recipe: మార్కెట్ ఫ్రెంచ్ ఫ్రైస్కు గుడ్బై.. ఇంట్లోనే కరకరలాడే మసాలా ఆలూ ఫ్రైస్!
-
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!