Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో సీనియర్ నక్సలైట్తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు.
Bade Chokkarao : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, మావోయిస్టు పార్టీ ఈ ప్రచారాన్ని ఖండించింది. దామోదర్ మృతిచెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖను సౌత్…
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ 14 గంటలపాటు కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 13 మంది నక్సలైట్లను హతమార్చాయి.
ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం.