Kodandaram: కేసీఆర్ ఆ పని చేయాలనుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో అదే విధంగా రేపు కూడా పని చేస్తాం.. తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. పదవులు తమ సొంతానికి ఉపయోగించుకోవడానికి కాదు.. తెలంగాణ జన సమితి నాయకులు చేసిన సేవకు ఫలితంగానే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది అని కోదండరాం పేర్కొన్నారు.
Read Also: Minister Seethakka: విద్యుత్ షాక్ తో ముగ్గురి మృతి.. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీతక్క
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ఈ రాజ్యాంగం పనికి రాదు అని కొందరు అనుకుంటున్నారు.. కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చూసున్నారు అని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అవి రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ప్రతీక రాజ్యాంగం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అందరం సమానమని భావించాం.. అసమానతలు పోయి సమానత్వంతో అందరూ బ్రతకాలి అని రాజ్యాంగం రాసుకున్నాం.. సమాన అవకాశాలు, హక్కులు ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది. ప్రభుత్వం పూనుకొని సమాన, ఆర్థిక అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం ప్రకటించింది అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా మంది రాజ్యాంగం మార్చాలని అనొచ్చు.. కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని అన్నారు. చైనా, సింగపూర్లో ఉన్న నియంతృత్వ పాలన ఉండాలని చూస్తున్నారు.. అందరం దేవుడ్ని మొక్కుతాం.. సమాజ మార్పు దానంతట అదే జరుగుతుంది అనుకుంటే జరగదు.. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారు అనే విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!