Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka ED Case: ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వ్యవసాయ భూమి కొనుగోలులో ఆమె పాత్రను పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేసి, ఫిబ్రవరి 2010లో అదే భూమిని అతనికి విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రియాంక గాంధీని నిందితురాలిగా పేర్కొనలేదు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
దర్యాప్తు ఏజెన్సీ ప్రకారం, పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేయడంలో ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించింది. డిసెంబర్ 2010లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా 2005-2006 మధ్య 334 కెనాల్స్ (40.08 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసి, అదే భూమిని మళ్లీ అతనికే విక్రయించాడు. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా పేరును చార్జిషీట్లో ప్రస్తావించింది. మనీలాండరింగ్ కేసులో డిఫెన్స్ డీలర్, లండన్కు చెందిన పరారీలో ఉన్న సంజయ్ భండారీ కూడా ఉన్నారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వచ్చాయనేది ఈడీ ఆరోపించింది. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దాల ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
Read Also: Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు
సంజయ్ భండారీ 2016లో యూకేకి పారిపోయారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన చట్టపరమైన అభ్యర్థన మేరకు బ్రిటీష్ ప్రభుత్వం అతనిని భారతదేశానికి అప్పగించడానికి ఈ ఏడాది జనవరిలో ఆమోదించింది. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, యూకే జాతీయుడు సుమిత్ చద్దాపై ఈ కేసులో తాజా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో థంపిని జనవరి 2020లో అరెస్టు చేశారు. అతను వాద్రాకు సన్నిహితుడని ఈడీ ఆరోపించింది.థంపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!