Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka ED Case: ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వ్యవసాయ భూమి కొనుగోలులో ఆమె పాత్రను పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేసి, ఫిబ్రవరి 2010లో అదే భూమిని అతనికి విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రియాంక గాంధీని నిందితురాలిగా పేర్కొనలేదు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
దర్యాప్తు ఏజెన్సీ ప్రకారం, పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేయడంలో ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించింది. డిసెంబర్ 2010లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా 2005-2006 మధ్య 334 కెనాల్స్ (40.08 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసి, అదే భూమిని మళ్లీ అతనికే విక్రయించాడు. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా పేరును చార్జిషీట్లో ప్రస్తావించింది. మనీలాండరింగ్ కేసులో డిఫెన్స్ డీలర్, లండన్కు చెందిన పరారీలో ఉన్న సంజయ్ భండారీ కూడా ఉన్నారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వచ్చాయనేది ఈడీ ఆరోపించింది. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దాల ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
Read Also: Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు
సంజయ్ భండారీ 2016లో యూకేకి పారిపోయారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన చట్టపరమైన అభ్యర్థన మేరకు బ్రిటీష్ ప్రభుత్వం అతనిని భారతదేశానికి అప్పగించడానికి ఈ ఏడాది జనవరిలో ఆమోదించింది. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, యూకే జాతీయుడు సుమిత్ చద్దాపై ఈ కేసులో తాజా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో థంపిని జనవరి 2020లో అరెస్టు చేశారు. అతను వాద్రాకు సన్నిహితుడని ఈడీ ఆరోపించింది.థంపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!