Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka ED Case: ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వ్యవసాయ భూమి కొనుగోలులో ఆమె పాత్రను పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేసి, ఫిబ్రవరి 2010లో అదే భూమిని అతనికి విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రియాంక గాంధీని నిందితురాలిగా పేర్కొనలేదు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
దర్యాప్తు ఏజెన్సీ ప్రకారం, పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేయడంలో ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించింది. డిసెంబర్ 2010లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా 2005-2006 మధ్య 334 కెనాల్స్ (40.08 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసి, అదే భూమిని మళ్లీ అతనికే విక్రయించాడు. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా పేరును చార్జిషీట్లో ప్రస్తావించింది. మనీలాండరింగ్ కేసులో డిఫెన్స్ డీలర్, లండన్కు చెందిన పరారీలో ఉన్న సంజయ్ భండారీ కూడా ఉన్నారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వచ్చాయనేది ఈడీ ఆరోపించింది. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దాల ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
Read Also: Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు
సంజయ్ భండారీ 2016లో యూకేకి పారిపోయారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన చట్టపరమైన అభ్యర్థన మేరకు బ్రిటీష్ ప్రభుత్వం అతనిని భారతదేశానికి అప్పగించడానికి ఈ ఏడాది జనవరిలో ఆమోదించింది. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, యూకే జాతీయుడు సుమిత్ చద్దాపై ఈ కేసులో తాజా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో థంపిని జనవరి 2020లో అరెస్టు చేశారు. అతను వాద్రాకు సన్నిహితుడని ఈడీ ఆరోపించింది.థంపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!