Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు..
Priyanka ED Case: ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వ్యవసాయ భూమి కొనుగోలులో ఆమె పాత్రను పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేసి, ఫిబ్రవరి 2010లో అదే భూమిని అతనికి విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రియాంక గాంధీని నిందితురాలిగా పేర్కొనలేదు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Also Read
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
దర్యాప్తు ఏజెన్సీ ప్రకారం, పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేయడంలో ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించింది. డిసెంబర్ 2010లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా 2005-2006 మధ్య 334 కెనాల్స్ (40.08 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసి, అదే భూమిని మళ్లీ అతనికే విక్రయించాడు. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా పేరును చార్జిషీట్లో ప్రస్తావించింది. మనీలాండరింగ్ కేసులో డిఫెన్స్ డీలర్, లండన్కు చెందిన పరారీలో ఉన్న సంజయ్ భండారీ కూడా ఉన్నారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వచ్చాయనేది ఈడీ ఆరోపించింది. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దాల ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
Read Also: Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు
సంజయ్ భండారీ 2016లో యూకేకి పారిపోయారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన చట్టపరమైన అభ్యర్థన మేరకు బ్రిటీష్ ప్రభుత్వం అతనిని భారతదేశానికి అప్పగించడానికి ఈ ఏడాది జనవరిలో ఆమోదించింది. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, యూకే జాతీయుడు సుమిత్ చద్దాపై ఈ కేసులో తాజా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో థంపిని జనవరి 2020లో అరెస్టు చేశారు. అతను వాద్రాకు సన్నిహితుడని ఈడీ ఆరోపించింది.థంపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.
తాజావార్తలు
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
-
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!