Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka ED Case: ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వ్యవసాయ భూమి కొనుగోలులో ఆమె పాత్రను పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేసి, ఫిబ్రవరి 2010లో అదే భూమిని అతనికి విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రియాంక గాంధీని నిందితురాలిగా పేర్కొనలేదు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
దర్యాప్తు ఏజెన్సీ ప్రకారం, పహ్వా నుంచి భూమిని కొనుగోలు చేయడంలో ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించింది. డిసెంబర్ 2010లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా 2005-2006 మధ్య 334 కెనాల్స్ (40.08 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసి, అదే భూమిని మళ్లీ అతనికే విక్రయించాడు. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా పేరును చార్జిషీట్లో ప్రస్తావించింది. మనీలాండరింగ్ కేసులో డిఫెన్స్ డీలర్, లండన్కు చెందిన పరారీలో ఉన్న సంజయ్ భండారీ కూడా ఉన్నారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వచ్చాయనేది ఈడీ ఆరోపించింది. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దాల ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది.
Read Also: Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు
సంజయ్ భండారీ 2016లో యూకేకి పారిపోయారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన చట్టపరమైన అభ్యర్థన మేరకు బ్రిటీష్ ప్రభుత్వం అతనిని భారతదేశానికి అప్పగించడానికి ఈ ఏడాది జనవరిలో ఆమోదించింది. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, యూకే జాతీయుడు సుమిత్ చద్దాపై ఈ కేసులో తాజా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో థంపిని జనవరి 2020లో అరెస్టు చేశారు. అతను వాద్రాకు సన్నిహితుడని ఈడీ ఆరోపించింది.థంపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!