PM Modi :జార్ఖండ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా.. విజయోత్సవ వేడుకలో మోడీ
- చివరి దశలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు
- హాజరైన జేపీ నడ్డా, ప్రధాని మోడీ
- కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార మహాయుతి గెలుపు స్పష్టమైంది. కాగా, ఎంవీఏ ప్రస్తుతం 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని 288 స్థానాలకు అక్టోబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరిగింది. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో 65 శాతానికి పైగా ఓటింగ్ జరగడంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది.
ప్రధాన కార్యాలయంలో మోడీ ప్రసంగం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రసంగం ప్రారంభించారు. కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి ఓట్లు వేశారని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలో సామాజిక, సుపరిపాలన, న్యాయం గెలిచాయని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలే బయటపెట్టారన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. జార్ఖండ్ ప్రజలకు నేను కూడా సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు జార్ఖండ్ సత్వర అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ‘కలిసి ఉంటే మనం సురక్షితంగా ఉంటాం’ అనేది దేశానికి గొప్ప మంత్రంగా మారిందన్నారు. హర్యానా తర్వాత ఈ ఎన్నికల అతిపెద్ద సందేశం ఐక్యత అని ప్రధాని అన్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఇత రాష్ట్రాల్లోను బీజేపీ ఘటన విజయం..
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. “ఈ రోజు చాలా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లు బీజేపీకి గట్టి మద్దతు ఇచ్చాయి. అసోం ప్రజలు మరోసారి బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోనూ విజయం సాధించాం. బీహార్లో ఎన్డిఎకు మద్దతు పెరిగింది. ఇది ఇప్పుడు దేశం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని చూపిస్తుంది.” అని పేర్కొన్నారు.
‘ఏక్ రహేతో సేఫ్ అహే’ అని నినదించిన మోడీ
‘ఏక్ రహేతో సేఫ్ అహే’ అనే నినాదాన్ని ప్రధాని మోడీ మరోసారి ప్రస్తావించారు. గత 50 ఏళ్లలో కూటమికి ఇదే అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ నాయకత్వంలో మహారాష్ట్ర కూటమిని ఆశీర్వదించడం ఇది వరుసగా మూడోసారని.. దీంతో పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చారిత్రాత్మకమైనదని.. బీజేపీ పాలనా నమూనాపై ఆమోద ముద్ర వేయబడిందన్నారు. సుపరిపాలన విషయంలో దేశం బీజేపీని, ఎన్డీయేను మాత్రమే విశ్వసిస్తుందని దీన్నిబట్టి అర్థమవుతోందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..