PM Modi: వచ్చే ఎన్నికల్లో దక్షిణ భారత్ నుంచే ప్రధాని మోడీ పోటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచి దేశవ్యాప్తంగా ఈ తొమ్మిదేళ్లలో పలు కీలక రాష్ట్రాల్లో విజయాలు సాధించిన కమలం పార్టీకి ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్ణాటక ఎలక్షన్స్ లో ఓడిపోయింది. అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ బీజేపీకి తగిలింది. దీంతో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా హస్తం పార్టీ ఖాతాలో పడేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అంతర్మథనంలో పడింది. నిన్న( ఆదివారం) జరిగిన బీజేపీ ప్రాంతీయ సంప్రదింపుల మీటింగ్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 10 మంది అరెస్ట్..
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీల్ని దక్షిణాది నుంచే గెలిచేలా చూడాలని నేతలకు జేపీ నడ్డా ఆదేశించించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ల ఇన్ఛార్జ్లు ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమితో దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలపై పడుతుందన్న అంచనాకు కమలం పార్టీ వచ్చింది. అలా జరుగకుండా చూడాలని దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. దక్షిణాదిలోని ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రధాని మోడీ ఇక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని బీజేపీ అధిష్టానం పేర్కొంది.
Read Also: Ustaad: శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ 12న విడుదల
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని దక్షిణాదిలోని ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనే దానిపై బీజేపీ కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఉన్న ఎంపీ సీట్లలో కానీ, తెలంగాణలోని సికింద్రాబాద్ వంటి సీటు నుంచి కానీ.. లేదా తమిళనాడు నుంచి కానీ పోటీ చేయించేందుకు అన్వేషణ చేస్తున్నారు. ఈ కసరత్తు త్వరలో పూర్తి చేసి మోడీ పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!