దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా ప్రత్యేకంగా అక్షింతలు తీసుకొని వెళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ.. కొండంత బలమివ్వు స్వామి అంటూ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంది ప్రీతి జింట.
Also Read:IPL 2025: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
ప్రస్తుత సీజన్ లో సన్ రైజర్స్ ఆశించినంతగా రాణించడం లేదు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో, ఒకే ఒక్క విజయం సాధించి నాలుగు మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. నేడు జరుగబోయే మ్యాచ్ లో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పరాజయాలతో సతమతమవుతున్న హైదరాబాద్ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.