TS Raj Bhavan: ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా రాజకీయ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రగతి భవన్-రాజ్ భవన్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. నేడు ( మంగళవారం ) తెలంగాణ రాజ్భవన్లో పంద్రాగస్టును పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్హోం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ తో పాటు అందరికి ఆహ్వానం పంపించింది. అయితే, తేనీటి విందు కార్యక్రమానికి రాజకీయ నేతల ఎవరు రాకపోవడంతో.. రాజ్ భవన్ లో హడావిడి లేక వెలవెలబోయింది. మరోసారి ఈ తేనీటి విందు ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
Read Also: Vijay- Rashmika : విజయ్- రష్మిక పరిచయానికి ఐదేళ్లు.. ఇలా ప్రేమను బయటపెట్టారు
Also Read
- UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ఇక, సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలకమైన నేతలు సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై నిర్విహించిన ఎట్ హోం కార్యక్రమానికి కేవలం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ తో పాటు మరి కొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అధికార, విపక్ష పార్టీలు సైతం ఎట్ హోం కార్యక్రమానికి రాకపోవడంతో రాజ్ భవన్ పరిసరాలు అంత హాడావుడిగా కనిపించడం లేదు. దీంతో రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య ఎప్పుడు సయోధ్య కుదురుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Nuh Voilence: నుహ్ హింసకు పాల్పడిన నిందితుడు అరెస్ట్
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!