Chalo Rajahmundry : వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రి అంటూ పిలుపు నివ్వడంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే అన్ని రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధనం చేశారు. తిరువూరు, జంగారెడ్డి గూడెం కూనవరం వెళ్లే రోడ్లపై పోలీసులు భారీ భారీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట నుంచి రాజమండ్రి, భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధానమైన రహదారులపై బారి కెడ్ల ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియా లో చంద్రబాబు అభిమానులు ప్రకటన జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Also Read : JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..
Also Read
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్న దృశ్యాలు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను చూపించాయి. ఛలో రాజమండ్రికి ఆంధ్రా పోలీసులు అనుమతి నిరాకరించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోకి ఐటీ ఉద్యోగుల ప్రవేశాన్ని పరిమితం చేయాలని విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా పోలీసు అధికారులను ఆదేశించారు. విజయవాడలో సీఆర్పీసీ 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మైలవరం ఏసీపీ రమేష్ తెలిపారు.
Also Read : PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..
తాజావార్తలు
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
-
Balakrishna : బాలకృష్ణకు తీవ్ర గాయం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల
-
Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!