Rahul Gandhi: పార్లమెంట్లో ప్రధాని ప్రసంగంపై రాహుల్గాంధీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్లో దాదాపు 2 గంటల 13 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. చివరకు మణిపూర్ అంశంపై 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారని రాహుల్ గాంధీ విమర్శించారు. “మణిపూర్ నెలల తరబడి కాలిపోతోంది, ప్రజలను చంపుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ ప్రధాని నవ్వుతున్నారు. , జోకులు పేలుస్తున్నారు.. అది ఆయనకు సరిపోదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
Also Read
ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం రెండు రోజుల్లో ఈ పనికిమాలిన పనిని ఆపగలదని, కానీ ప్రధాని మణిపూర్ను తగలబెట్టాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మంటలను ఆర్పడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. 2028లో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 2024లో మోడీ ప్రధాని అవుతారా అనేది ప్రశ్న కాదని.. పిల్లలు, ప్రజలు చంపబడుతున్న మణిపూర్ అంశమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ ప్రసంగం భారతదేశం గురించి కాదని, నరేంద్ర మోడీ గురించి అంటూ రాహుల్ మండిపడ్డారు. ఆయన తన అభిప్రాయాలు, తమ రాజకీయాలు, ఆశయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read: Independence Day: ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగే ప్రదేశాలు
ప్రధానమంత్రి కనీసం మణిపూర్కు వెళ్లి సంఘాలతో మాట్లాడి మీ ప్రధానమంత్రిని అని చెప్పవచ్చని.. ఆ సమస్యను పరిష్కరించవచ్చని, కానీ అలాంటి ఉద్దేశం ఎక్కడా కనిపించలేదని రాహుల్ ఆరోపించారు. ప్రధాని చేతిలో ఎన్నో హింసను అంతం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని మోడీ ఉపయోగించడం లేదని ఆయన అన్నారు. మణిపూర్లో హింస చెలరేగిపోతోందని, ఆ హింసను అరికట్టడం ప్రధానిగా ఆయన మొదటి కర్తవ్యమని.. కానీ ఆయన ఏమీ చేయకుండా నవ్వుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్పై వ్యాఖ్యానిస్తూ.. ‘ప్రభుత్వం ఎంపీలను సస్పెండ్ చేసినా తమ పని మారదని, మణిపూర్లో హింసను అరికట్టడమే మా పని’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?