GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST On Online Gaming: మనం వాడే దాదాపు అన్ని వస్తువులపై పన్నును విధిస్తున్నారు. వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పేరుతో పన్నును విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జీఎస్టీ కేంద్రం(సెంట్రల్)తోపాటు స్టేట్(రాష్ట్రం) కూడా పన్ను రూపంలో విధిస్తున్నాయి. వీటికి తోడు ఇకపై ఆన్లైన్ గేమింగ్పై కూడా పన్ను విధించనున్నారు. ఆన్లైన్ క్రీడలపై పన్ను విధించడానికి సంబంధించిన సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీంతో ఆన్గేమింగ్పై ఇక జీఎస్టీని విధించనున్నారు. ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్నుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ (GST council) సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
Read also: Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు మరియు క్యాసినోలలో బెట్టింగ్ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ శుక్రవారం లోక్సభ బిల్లును ఆమోదించింది. లోక్సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్సభలో విపక్షాల నిరసనల మధ్య కేంద్రం వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023లకు లోక్సభ ఆమోదం తెలిపింది.
నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకురావాలనుకున్న బిల్లులను అన్నింటిని పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టు అయింది. ఇప్పటికే కీలక బిల్లులను ఆమోదించుకున్న కేంద్రం.. వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చింది. రాజ్యసభలో కూడా జీఎస్టీ సవరణ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రాల శాసనసభలు కూడా GST చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జీఎస్టీ ఎంత అనేది స్పష్టం అవుతుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!