Narendra Modi: కేరళలోనూ కమలం వికసిస్తుందంటున్న మోడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలను ప్రభావితం చేసేలా సభలను నిర్వహిస్తున్నారు. ఇక దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. గత రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తికాలకు వెళ్తే..
Also Read: Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
కేరళ లోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేరళలో కమలం వికసిస్తుందని ఆయన అన్నారు. నేడు ఉదయం 10:45 గంటలకు పాలక్కడ్ లో ప్రారంభమైన ర్యాలీలో సౌత్ కేరళ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు ఆయన మద్దతు ఇచ్చారు. కేరళ రాష్ట్ర ప్రజలు ఇన్నాల్లు కష్టాలను చవిచూశారని అంటూనే.. అవినీతి, అసమర్థతలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ప్రధాని మండిపడ్డారు.
Also Read: PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
ప్రస్తుతం కేరళలో పోటీ పడే ఎల్డీఎఫ్, యూడిఎఫ్ లు ఢిల్లీలో ఒక్కటయ్యాయని., ఈ పార్టీలు కేరళ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఈ సంవత్సరం మొదలు ప్రధాని మోడీ.. అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా కేరళ లోని ప్రముఖ దేవాలయాలనూ ఆయన సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్తారని ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!