CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం
- స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. సమావేశం ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంతో ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.
మొదటి రోజు సమావేశంలో ప్రధానంగా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు, జిల్లాల వారీగా నిర్ణయించిన అభివృద్ధి లక్ష్యాలు, వాటి పురోగతిపై సమీక్ష జరగనుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. రెండో రోజు సమావేశంలో ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ వ్యవహారాలు, వేసవికాలంలో తాగునీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై అధికారులు సమగ్రంగా చర్చించనున్నారు.
Also Read
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
అదే విధంగా గురువారం సాయంత్రం రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అండ్ ఇతర విభాగాల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ఈ రెండు రోజుల సమావేశం ద్వారా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్బై
-
Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
-
Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్సీ పెద్దాయన కథ ఇదే!
-
Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!