PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ”వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల”ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని రాణి కమలాపతి రైల్వే స్టేషన్కు చేరుకుని ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్, బెంగళూరు-హుబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించిన వందేభారత్ రైళ్లతో వివిధ నగరాల అనుసంధానం జరగడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అదనపు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికావృద్ధి కూడా జరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. దేశీయంగా వందేభారత్ రైళ్ల తయారీతో దేశ మ్యాన్యుఫ్యాక్టరింగ్ రంగం కూడా పురోగతి బాట పట్టనుంది.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
Also Read: Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటలకు షాడోల్లో బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు.సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. షాడోల్ జిల్లాలోని పకారియా గ్రామాన్ని కూడా ప్రధాని మోడీ సందర్శించనున్నారు. షాడోల్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, ఆయన నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభించి.. లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు.సికిల్ సెల్ వ్యాధి, ముఖ్యంగా గిరిజన జనాభాలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం ఈ మిషన్ లక్ష్యం. 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రయోగం కీలక మైలురాయిగా నిలుస్తుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ 2023 కేంద్ర బడ్జెట్లో ప్రకటించబడింది. ఇది 17 అత్యధిక జిల్లాల్లో 278 జిల్లాల్లో అమలు చేయబడుతుంది. దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కేంద్రీకృతమై ఉన్నాయి.
Also Read: Pakistan: మహిళలు, పిల్లలపై పెరిగిన హింస.. 4 నెలల్లో 900కు పైగా హింసాత్మక కేసులు
మధ్యప్రదేశ్లో దాదాపు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డుల పంపిణీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు, డెవలప్మెంట్ బ్లాకుల్లో నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలు 100 శాతం సంతృప్తమయ్యేలా ప్రతి లబ్దిదారునికి చేరువ చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ఆయుష్మాన్ కార్డు పంపిణీ ప్రచారం ఒక అడుగు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ‘రాణి దుర్గావతి గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా రాణి దుర్గావతిని సత్కరిస్తారు. రాణి దుర్గావతి పరాక్రమాన్ని, త్యాగాన్ని ప్రచారం చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిర్వహిస్తోంది. రాణి దుర్గావతి 16వ శతాబ్దం మధ్యలో గోండ్వానాను పాలించిన రాణి. మొఘల్లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధైర్యవంతురాలు రాణి దుర్గావతి.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!