PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ”వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల”ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని రాణి కమలాపతి రైల్వే స్టేషన్కు చేరుకుని ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్, బెంగళూరు-హుబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించిన వందేభారత్ రైళ్లతో వివిధ నగరాల అనుసంధానం జరగడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అదనపు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికావృద్ధి కూడా జరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. దేశీయంగా వందేభారత్ రైళ్ల తయారీతో దేశ మ్యాన్యుఫ్యాక్టరింగ్ రంగం కూడా పురోగతి బాట పట్టనుంది.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
Also Read: Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటలకు షాడోల్లో బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు.సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. షాడోల్ జిల్లాలోని పకారియా గ్రామాన్ని కూడా ప్రధాని మోడీ సందర్శించనున్నారు. షాడోల్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, ఆయన నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభించి.. లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు.సికిల్ సెల్ వ్యాధి, ముఖ్యంగా గిరిజన జనాభాలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం ఈ మిషన్ లక్ష్యం. 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రయోగం కీలక మైలురాయిగా నిలుస్తుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ 2023 కేంద్ర బడ్జెట్లో ప్రకటించబడింది. ఇది 17 అత్యధిక జిల్లాల్లో 278 జిల్లాల్లో అమలు చేయబడుతుంది. దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కేంద్రీకృతమై ఉన్నాయి.
Also Read: Pakistan: మహిళలు, పిల్లలపై పెరిగిన హింస.. 4 నెలల్లో 900కు పైగా హింసాత్మక కేసులు
మధ్యప్రదేశ్లో దాదాపు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డుల పంపిణీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు, డెవలప్మెంట్ బ్లాకుల్లో నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలు 100 శాతం సంతృప్తమయ్యేలా ప్రతి లబ్దిదారునికి చేరువ చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ఆయుష్మాన్ కార్డు పంపిణీ ప్రచారం ఒక అడుగు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ‘రాణి దుర్గావతి గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా రాణి దుర్గావతిని సత్కరిస్తారు. రాణి దుర్గావతి పరాక్రమాన్ని, త్యాగాన్ని ప్రచారం చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిర్వహిస్తోంది. రాణి దుర్గావతి 16వ శతాబ్దం మధ్యలో గోండ్వానాను పాలించిన రాణి. మొఘల్లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధైర్యవంతురాలు రాణి దుర్గావతి.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!