Pakistan: మహిళలు, పిల్లలపై పెరిగిన హింస.. 4 నెలల్లో 900కు పైగా హింసాత్మక కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
మహిళలు, పిల్లలపై కేసులు పెరిగాయి..
ఈ నివేదిక ప్రకారం, ఈ నాలుగు నెలల్లో 529 మంది మహిళలు అపహరణకు గురయ్యారు. 119 గృహ హింస కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 56 అత్యాచార కేసులు, 37 పరువు హత్య కేసులు నమోదయ్యాయి. కరాచీ సెంట్రల్, హైదరాబాద్, కెమారి జిల్లాలు మహిళలపై హింసాత్మక నేరాలకు హాట్స్పాట్లుగా మారాయి. చిన్నారులపై నమోదైన కేసుల్లో లైంగిక వేధింపుల కేసులు అత్యధికం కాగా, ఇప్పటివరకు దాదాపు 67 కేసులు నమోదయ్యాయి. పౌరులందరికీ, ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థ మరింత శ్రద్ధ వహించాలని, చర్యలు తీసుకోవాలని నివేదిక కోరింది.
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
Also Read: MS Dhoni: విమానంలో ధోనికి చాక్లెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. వైరల్ అవుతున్న వీడియో..!
కూతురిపై అత్యాచారం చేసిన కన్నతండ్రి
పాకిస్థాన్లోని నోరావాల్లోని సియాల్కోట్ జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, సియాల్కోట్ జిల్లాలోని పస్రూర్ తహసీల్లోని బని సిల్హరియన్ గ్రామంలో ఒక వ్యక్తి తన సొంత కుమార్తెపై అత్యాచారం చేశాడు, దీనికి నిందితుడైన తండ్రికి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి మరణశిక్ష విధించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి 2022 జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నిందితుడు నజీమ్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా పోలీసు అధికారి ముహమ్మద్ హసన్ ఇక్బాల్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత, నిందితుడైన తండ్రిని పస్రూర్లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ విచారణ తర్వాత, న్యాయమూర్తి ఉమర్ ఫరూఖ్ ఖాన్ నజీమ్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. జరిమానా చెల్లించాలని లేదా జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కూడా కోర్టు నిందితుడిని ఆదేశించింది.
Also Read: Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం
పాకిస్థాన్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చాలా కాలంగా 13 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. విచారణ తర్వాత, మైనర్ మృతదేహం హైదరాబాద్ శివార్లలోని కైమ్ బబ్బర్ గ్రామంలో మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. తొలుత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కొందరు బంధువులు అడ్డుకోవడంతో విచారణ ఆలస్యమైంది. అయితే, ప్రాథమిక నివేదికను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు పంపారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన హైదరాబాద్ మేయర్ కాషిఫ్ షోరో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!