PM Modi: రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసి మోడీ.. కీలక అంశంపై చర్చ!
- పార్లమెంట్లో విపక్షాల నిరసనలు
- నిరసనల మధ్య రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసి మోడీ
- కీలక అంశంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తదుపరి ఛైర్మన్ ఎంపికపై చర్చించేందుకు ప్రధాని మోడీ ఇద్దరు కాంగ్రెస్ నేతలను కలిశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. రాజ్యసభలో కాంగ్రెస్తో సహా మొత్తం ప్రతిపక్షానికి ఖర్గే నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముఖ్యమైన నియామకాన్ని పర్యవేక్షించే ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీలో ఈ ఇద్దరు నేతలు కూడా ఉన్నారు.
READ MORE: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇదిలా ఉండగా… డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో దేశ ప్రజలు చూశారు. గత కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ కొనసాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేడ్కర్ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో వారు దాచలేరు. అలా అనుకుంటే వారు పెద్ద పొరబాటు చేసినట్లే. దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను ఎప్పటికి ఈ దేశ ప్రజలు మర్చిపోరు. మనం ఇలా ఉండటానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కరే కారణం. గత దశాబ్దకాలంగా అంబేడ్కర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు మా సర్కార్ అవిశ్రాంతంగా కృషి చేసింది.” అని మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!