Joe Biden: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జో బైడెన్.. ఆహ్వానించిన మోడీ..
2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారని అమెరికా రాయబారి తెలిపారు. జనవరి 26, 2024 గణతంత్ర వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రెసిడెంట్ జో బైడెన్ ని ప్రధాని ఆహ్వానించినట్లుగా భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. జీ20 సదస్సుకు ముందు రోజు ఇరువురు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోడీ కోరినిట్లు గార్సెట్టి చెప్పారు.
Read Also: Pakistan: ఏంటీ బాబు నీకు అమ్మాయిలు దొరకలేదా.. అమ్మమ్మను పెళ్లి చేసుకున్నావ్!
Also Read
భారతదేశ వ్యూహాత్మక, దౌత్య, ఆర్థిక ప్రయోజనాలు, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిఫ్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తే ఆల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (2007), ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజీ (2008), ఫ్రాంకోయిస్ హోలాండే (2016) కూడా గతంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!