భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) జమ్మూలో పర్యటించనున్నారు. దాదాపు రూ.13,375 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 20, మంగళవారం దినఫలాలు
ఇక, ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్ను నేడు ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతే కాకుండా 48.1 కిలో మీటర్ల పొడవైన బనిహాల్- సంగల్దాన్ రైల్వే సెక్షన్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అయితే, మొత్తం రూ.32,000 వేల కోట్లతో పలు అభివృద్ది పనులను ఆయన జాతీకి అంకితం చేయనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కిలో మీటర్ల పొడవైన ఉధంపూర్- శ్రీనగర్ -బారాముల్లా మీదుగా తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాడిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది.. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
Read Also: YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీంతో పాటు ఈ టెర్మినల్లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ- అమృత్సర్- కత్రా ఎక్స్ప్రెస్వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.