PM Modi: ఆ సర్వేలో ప్రధానికి అత్యధిక రేటింగ్.. ఏ విషయంలోనంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది. ఆయనను అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా అభివర్ణించగా.. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మార్నింగ్ కన్సల్ట్ ఎన్నికైన నాయకులకు వారానికోసారి ఆమోదం రేటింగ్లను అందిస్తుంది. ఈ సర్వేలో ప్రధాని మోడీ నిలకడగా అగ్రస్థానంలో ఉన్నారు. అతని ఆమోదం రేటింగ్ ఎక్కువగా 70 కంటే ఎక్కువ.
Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
Also Read
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ‘X’, (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వే.. ప్రపంచ నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణ అసమానంగా ఉందని ఆయన రాశారు. విదేశాంగ విధానంలో ప్రధాని సూత్రం విజయవంతమవడమే కాకుండా.. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడంలో ప్రధాని మోడీ సాధించిన విజయాలు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన నిస్వార్థ కృషి, ఆయనపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. అని అమిత్ షా తెలిపారు.
The latest Morning Consult survey shows that PM @narendramodi Ji's popularity remains unrivalled among global leaders.
This is not only a testament to the success of the Modi doctrine in foreign policy but also a global recognition of Modi Ji's undeterred achievements in lifting… pic.twitter.com/yuuYz5zYIi
— Amit Shah (@AmitShah) September 15, 2023
Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!
మరోవైపు జీ-20 సమ్మిట్ 2023కి భారతదేశం అధ్యక్షుడిగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అత్యధిక గ్లోబల్ అప్రూవల్ రేటింగ్తో పీఎం మోడీ అగ్రగామిగా నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత ప్రధాని మోడీ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయిలో విశ్వాసం, నాయకత్వానికి అసమానమైన చిహ్నంగా ప్రధాని మోడీ నిలిచారన్నారు. అట్టడుగున ఉన్నవారికి సాధికారత కల్పించడానికి అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడానికి అతని అసాధారణ అంకితభావంలో అతను చెప్పలేని స్ఫూర్తి అని అన్నారు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!