PM Modi: ఆ సర్వేలో ప్రధానికి అత్యధిక రేటింగ్.. ఏ విషయంలోనంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది. ఆయనను అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా అభివర్ణించగా.. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మార్నింగ్ కన్సల్ట్ ఎన్నికైన నాయకులకు వారానికోసారి ఆమోదం రేటింగ్లను అందిస్తుంది. ఈ సర్వేలో ప్రధాని మోడీ నిలకడగా అగ్రస్థానంలో ఉన్నారు. అతని ఆమోదం రేటింగ్ ఎక్కువగా 70 కంటే ఎక్కువ.
Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ‘X’, (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వే.. ప్రపంచ నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణ అసమానంగా ఉందని ఆయన రాశారు. విదేశాంగ విధానంలో ప్రధాని సూత్రం విజయవంతమవడమే కాకుండా.. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడంలో ప్రధాని మోడీ సాధించిన విజయాలు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన నిస్వార్థ కృషి, ఆయనపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. అని అమిత్ షా తెలిపారు.
The latest Morning Consult survey shows that PM @narendramodi Ji's popularity remains unrivalled among global leaders.
This is not only a testament to the success of the Modi doctrine in foreign policy but also a global recognition of Modi Ji's undeterred achievements in lifting… pic.twitter.com/yuuYz5zYIi
— Amit Shah (@AmitShah) September 15, 2023
Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!
మరోవైపు జీ-20 సమ్మిట్ 2023కి భారతదేశం అధ్యక్షుడిగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అత్యధిక గ్లోబల్ అప్రూవల్ రేటింగ్తో పీఎం మోడీ అగ్రగామిగా నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత ప్రధాని మోడీ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయిలో విశ్వాసం, నాయకత్వానికి అసమానమైన చిహ్నంగా ప్రధాని మోడీ నిలిచారన్నారు. అట్టడుగున ఉన్నవారికి సాధికారత కల్పించడానికి అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడానికి అతని అసాధారణ అంకితభావంలో అతను చెప్పలేని స్ఫూర్తి అని అన్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..