PM Modi: ఆ సర్వేలో ప్రధానికి అత్యధిక రేటింగ్.. ఏ విషయంలోనంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది. ఆయనను అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా అభివర్ణించగా.. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మార్నింగ్ కన్సల్ట్ ఎన్నికైన నాయకులకు వారానికోసారి ఆమోదం రేటింగ్లను అందిస్తుంది. ఈ సర్వేలో ప్రధాని మోడీ నిలకడగా అగ్రస్థానంలో ఉన్నారు. అతని ఆమోదం రేటింగ్ ఎక్కువగా 70 కంటే ఎక్కువ.
Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ‘X’, (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వే.. ప్రపంచ నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణ అసమానంగా ఉందని ఆయన రాశారు. విదేశాంగ విధానంలో ప్రధాని సూత్రం విజయవంతమవడమే కాకుండా.. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడంలో ప్రధాని మోడీ సాధించిన విజయాలు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన నిస్వార్థ కృషి, ఆయనపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. అని అమిత్ షా తెలిపారు.
The latest Morning Consult survey shows that PM @narendramodi Ji's popularity remains unrivalled among global leaders.
This is not only a testament to the success of the Modi doctrine in foreign policy but also a global recognition of Modi Ji's undeterred achievements in lifting… pic.twitter.com/yuuYz5zYIi
— Amit Shah (@AmitShah) September 15, 2023
Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!
మరోవైపు జీ-20 సమ్మిట్ 2023కి భారతదేశం అధ్యక్షుడిగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అత్యధిక గ్లోబల్ అప్రూవల్ రేటింగ్తో పీఎం మోడీ అగ్రగామిగా నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత ప్రధాని మోడీ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయిలో విశ్వాసం, నాయకత్వానికి అసమానమైన చిహ్నంగా ప్రధాని మోడీ నిలిచారన్నారు. అట్టడుగున ఉన్నవారికి సాధికారత కల్పించడానికి అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడానికి అతని అసాధారణ అంకితభావంలో అతను చెప్పలేని స్ఫూర్తి అని అన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!