Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plea Filed In Court Against Release Of Bihar Ex MP Anand Mohan: మూడు దశాబ్దాల క్రితం ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవించిన గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేసిన బీహార్ జైలు నిబంధనల సవరణను సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2007లో శిక్షకు ముందు ఎంపీగా ఉన్న మోహన్ గురువారం ఉదయం సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ ఎంపీ విడుదలను వ్యతిరేకిస్తూ పిటిషనర్ అనుపమ్ కుమార్ సుమన్ బుధవారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క ఇ-ఫైలింగ్ స్క్రీన్షాట్లతో పాటు తన ట్విట్టర్ హ్యాండిల్లో సమాచారాన్ని పంచుకున్నారు. “బీహార్లో ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన కేసులో దోషికి విధించిన శిక్షను తగ్గించడానికి అనుమతించే ప్రమాదకరమైన సవరణను సవాలు చేస్తూ నిన్న హైకోర్టులో పిల్ దాఖలు చేసాను” అని సుమన్ హిందీలో రాశారు.
14 ఏళ్లకు పైగా కటకటాల వెనుక గడిపినందున ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలని ఆదేశించిన 20 మందికి పైగా ఖైదీల జాబితాలో ఆనంద్ మోహన్ పేరు ఉంది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న బీహార్ జైలు మాన్యువల్లో చేసిన సవరణను అనుసరించి అతని శిక్షను ఉపసంహరించుకున్నారు. దీని ద్వారా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడంపై ఉన్న ఆంక్షలు తొలగించబడ్డాయి. మోహన్ని విడుదల చేయడంలో సహాయపడటానికి ఇది జరిగిందని విమర్శకులు పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేసిన సుమన్ స్వయంగా మాజీ సివిల్ సర్వెంట్, రాజకీయ ప్రస్థానం కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
Also Read
Read Also: Bottle of Water: నీటి బాటిల్కు రూ. 50 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన వాటర్!
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలను కృష్ణయ్య కుటుంబ సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. అతణ్ని విడుదల చేయడం తప్పుడు నిర్ణయమని కృష్ణయ్య భార్య ఉమాదేవి పేర్కొన్నారు. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారన్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఆనంద్ను మళ్లీ జైలుకు పంపాలని నితీశ్ను డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతోనే నితీశ్ ప్రభుత్వం ఆనంద్ను విడుదల చేసిందని కృష్ణయ్య కుమార్తె పద్మ విమర్శించారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి, 1994లో గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేసిన జి.కృష్ణయ్య హత్య కేసులో 15 ఏళ్లుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బిహార్ గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ గురువారం ఉదయం సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు. నీతీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల జైలు మాన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసి వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీల విడుదలకు నోటికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!