Phone Tapping: ఎల్లుండి రాత్రి హైదరాబాద్ కు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- ఎల్లుండి రాత్రి హైదరాబాద్ కు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- 9న సిట్ ముందు విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ వారెంట్ను విడుదల చేసింది. పాస్పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జారీ అయ్యింది. ఈ పరిణామాలతో ప్రభాకర్ రావు శనివారం భారత్కు బయలుదేరి, జూన్ 8 అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే జూన్ 9 ఉదయం ఆయన సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
అత్యధిక ట్రాఫిక్ రద్దీ కలిగిన టాప్ 10 నగరాలు ఇవే..!
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, తమదే పార్టీకి చెందిన అసమ్మతి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం చాలా రోజులు గోప్యంగా కొనసాగినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ విషయాన్ని ప్రస్తావించగా, వెంటనే సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల విచారణలో ప్రభాకర్ రావు పేరు ప్రముఖంగా వచ్చిందని సమాచారం. అయితే అప్పటికే ఆయన అమెరికాలో ఉండటంతో, అతన్ని భారత్కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి తనపై రాజకీయ కక్షతో కేసు పెట్టారని వాదించగా, కోర్టు ఆయన విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. పాస్పోర్ట్ రద్దు కావడంతో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆయన దేశానికి తిరిగి రానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీసా జారీ అయిన తర్వాత మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించబడింది.
Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!