Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు
- కన్నడ భాష వివాదంపై స్పందించిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ..
- కన్నడ భాష నేర్చుకోవడానికి కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు..
- స్థానిక భాష, సంస్కృతిని గౌరవించాలి: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్
Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ టెక్ ఇన్వెస్టర్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో పని చేసే ఉద్యోగులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు. అలాగే, ప్రజా సంబంధిత వ్యవహారాల్లో దాన్ని ఉపయోగించాలని అన్నారు. కన్నడ భాష నేర్చుకోవడానికి కొందరు అధికారులు నిరాకరించడంతోనే తరుచూ వివాదాలకు కారణమవుతుందని వెల్లడించారు. వీటిని నివారించేందుకు కన్నడను పక్కా నేర్చుకోవాలని అన్నారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ మోహన్ దాస్ పాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
Also Read
- Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
- Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
కాగా, బెంగళూరుకు రోజు భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని మోహన్దాస్ పాయ్ పేర్కొన్నారు. స్థానికంగా కన్నడ మాట్లాడేవారు కేవలం 33 శాతం మంది మాత్రమే ఉంటారు.. బయటి నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు.. కానీ, కొందరు అహంకారంతో కొన్ని కన్నడ పదాలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోవడం లేదన్నారు. కొన్ని పదాలైనా నేర్చుకొని మాట్లాడుతూ స్థానికులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ మోహన్దాస్ పాయ్ చేశారు.
Read Also: Oasis: ఒయాసిస్ జనని యాత్ర బస్ను ఆడోనిలో ప్రారంభించిన ఎమ్మెల్సీ డా. ఎ. మధుసూదన్
అయితే, గత నెలలో బెంగళూరులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి వ్యవహారంపై ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ గుర్తు చేశారు. ఒక బ్యాంక్ మేనేజర్ కస్టమర్తో కన్నడ భాషలో మాట్లాడడానికి నిరాకరించడం ప్రజల ఆగ్రహానికి గురి చేసిందని వెల్లడించారు. చివరకు బ్యాంక్ నుంచి అధికారిక క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ సేవల్లో ఉన్నవారు అక్కడి స్థానిక భాష, సంస్కృతిని గౌరవించాలని కోరారు. కస్టమర్కు హిందీ, ఇంగ్లీష్ రాని పక్షంలో ఉద్యోగులే లోకల్ భాష తప్పనిసరిగా మాట్లాడగలిగేలా ఉండాలని మోహన్దాస్ పాయ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
-
Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
-
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
-
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!