Perni Nani: లిక్కర్ కేసులో నెక్ట్స్ జగన్ను ఇరికిస్తారు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..!
- లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్ లోకి తెచ్చారు
- పార్టీ నుంచి బయటకు వెళ్ళటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెచ్చారు
- ఆ తర్వాత జగన్ పేరు తెస్తారు..
- మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
READ MORE: Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్పై కేసు..
Also Read
లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్ లోకి తెచ్చారు.. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెచ్చారు.. ఆ తర్వాత జగన్ పేరు తెస్తారని మాజీ మంత్రి ఆరోపించారు.. ఇసుమంత కూడా బిడియపడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.. మరొకరు డబ్బు మొత్తం ఫారిన్ వెళ్ళిపోయాయి అని చెప్తారు.. ఆ తర్వాత ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటారు.. ఇప్పుడేమో మిథున్ రెడ్డి అంటున్నారని వ్యాఖ్యానించారు.. రోజుకో కథ వండి వారుస్తున్నారని… లక్షల కోట్ల పేజీల మెమరీ డిలీట్ చేశారని పేపర్లలో రాస్తారని.. జగన్ అరెస్ట్ నుంచి మొదలు పెట్టి కిందకు వస్తారన్నారు.
READ MORE: (no title)
బట్ట కాల్చి ఎదుటి వారిపై వేసే రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. “చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు.. జగన్ను కూడా అరెస్ట్ చేయాలి.. చంద్రబాబు పోలీసులకు ధైర్యం చెప్పారని ఓసారి చెప్తారు.. పేపర్ లో వార్త రాస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన రెడ్ బుక్ రాజ్యాంగకర్త.. పీఎస్ఆర్ ఆంజనేయులు పక్కగా విధి నిర్వహణ చేశాను అని నమ్మాడు కాబట్టే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.. జైలులో కూడా ఆయన చంద్రబాబుకు నిత్య పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు.. అరెస్ట్ అప్పుడే అన్నీ వెతుకున్నారు కదా.. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సోదాలు.. రాజ్యమే ప్రజలను హింసిస్తే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోతారు.. ఏపీలో తల్లికివందనం జరుగుతుందని ఢిల్లీ మీడియాకు చెబుతున్న చంద్రబాబు.. ఏపీలో ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు.” అని విమర్శించారు.
READ MORE: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మొత్తం ఫుటేజీ 7.30 గంటలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఎడిటర్
సొంత పార్టీ నేతలే ప్రజల దగ్గరకు వెళ్లలేక మదన పడుతున్నారని.. ఈ ప్రభుత్వం ఆ ముగ్గురి సంపద సృష్టి కోసం మాత్రమే అని వైసీపీ నేత పేర్ని నాని తెలిపారు.. “చంద్రబాబు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానంలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు.. జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను.. నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు.. సంవత్సరం తిరిగే లోపు లక్షన్నర కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇంట్ కరెంట్ కోసం యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నారు..” అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!