PCC Chief: కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. పదేళ్ళు ప్రాథమిక వైద్యాన్ని మంటగలిపారు
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ
- హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం
- కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం- మహేష్ కుమార్ గౌడ్
- అన్ని హామీలను నెరవేర్చడంలో ముందుంటాం- మహేష్ కుమార్ గౌడ్
- పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని బీఆర్ఎస్ మంటగలిపింది- మహేష్ కుమార్ గౌడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ సభకు వెళ్లాలని ఉదయానే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడితే సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Read Also: Pushpa 2 : పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్
Also Read
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
తనకు చిన్నప్పుడు గాయమైతే ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేశారు.. అప్పుడు వైద్య సిబ్బంది లేరని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. 2008లో ప్రజల మనిషిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీల కోసం అప్పుడు జీవో తీసుకొచ్చారని అన్నారు. కొంతమంది వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయడం వల్ల వైద్యం వికటించి చనిపోతున్నారు అలాంటివి అరికట్టాలని తెలిపారు. మరోవైపు.. పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని బీఆర్ఎస్ మంటగలిపిందని ఆరోపించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నాం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Read Also: Summer: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో..!
పదేళ్లపాటు కనీసం బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.. తప్పకుండా సీఎం రేవంత్, తాను, కోదండరాం.. అందరం కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లక్షల వేలకోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కట్టుకుంటూ.. రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం పనిచేస్తున్నామని అన్నారు. కుల సర్వే చేశాం.. భారతదేశంలో ఎక్కడ జరగలేదు, తెలంగాణలో జరిగిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందని అభిప్రాయపడ్డారు. మంచి పని చేయాలన్నా చట్టబద్దత ఇవ్వాలి.. అందుకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మీ పై జరుగుతున్న దాడులపై కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. మంత్రితో చర్చిస్తాం..
కేసులు ఎత్తేవేసే దిశగా ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!