Champions Trophy 2025: కాస్త ఓపిక పట్టండి.. ఏం జరుగుతుందో చూస్తారు: పీసీబీ చీఫ్
- ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో సందిగ్థత
- ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు
- త్వరలో ఐసీసీ షెడ్యూల్ను ప్రకటిస్తుంది
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు.
పాకిస్థాన్లో పర్యటించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వివరించాలని తాము ఐసీసీకి లేఖ రాశామని మొహసీన్ నఖ్వీ చెప్పారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించిన ప్రతి టీమ్ పాకిస్థాన్కు వచ్చేందుకు రెడీగా ఉంది. భద్రత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మేం వారితో చర్చించి పరిష్కరిస్తాం. క్రీడలు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. అంతా బాగానే జరుగుందని ఆశిస్తున్నాము. ఐసీసీ త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటిస్తుంది’ అని నఖ్వీ తెలిపారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సి వస్తే పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలుగుతుందా? అన్న ప్రశ్నకు మొహసీన్ నఖ్వీ సమాధానం ఇచ్చారు. ‘పాకిస్థాన్ గౌరవం అన్నింటి కన్నా ముఖ్యమైనది. కాస్త ఓపిక పట్టండి, ఏం జరుగుతుందో చూస్తారు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్లో జరుగుతుందని అనుకుంటున్నాం’ అని నఖ్వీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ట్రోఫీ జరగాల్సి ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్లో ట్రోఫీ జరగగా.. పాకిస్థాన్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో