Pawan Kalyan: కాకినాడలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ.. కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. అందులో భాగంగా.. పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాజకీయ నాయకులు యువతను ఓట్లు కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. సమాజానికి తన వంతు సాయం చేయాలని జనసేన పార్టీ పెట్టడం జరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొ్న్నారు. అంతేకాకుండా కాకినాడ తనకు ఎప్పుడు అండగా నిలబడిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తలచుకుంటే ఏపీకి మార్గ దర్శం చేయవచ్చు అన్నారు. అంతేకాకుండా తమ పెద్దనాన్న ఇక్కడే పోస్ట్ మాస్టర్ గా పని చేశారని పవన్ తెలిపారు.
Read Also: Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
మరోవైపు పవన్ మాట్లాడుతూ.. కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి.. పవన్ కళ్యాణ్ ఏమి చేయలేడు అనే ఉద్దేశ్యంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాడని.. దిగజారుడు బూతులు, పిచ్చి పిచ్చిగా తిట్టాడని పవన్ అన్నారు.
Read Also: BJP MP GVL: సీఎం జగన్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్.. కేంద్ర నిధులతోనే నవరత్నాలు ఇస్తున్నారని ఆరోపణ..!
ఎమ్మెల్యే బియ్యం ఎగుమతి చేస్తాడు, దొంగ నోట్లు ముద్రించాడు అని మా వాళ్ళు చెప్పారని పవన్ అన్నారు. అప్పట్లో ఉండే ఎస్పీ నాయక్ వాళ్ల కుటుంబ సభ్యులను బేడీలు వేసి నడిపించాడని తెలిసిందన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన చేస్తే జనసేన కార్యకర్తలపై రాళ్ళ దాడి చేశారన్నారు. ఈ క్రిమినల్ కి బుద్ధి చెప్పాలని అప్పుడే అనుకున్నట్లు పవన్ కల్యాన్ తెలిపారు. ఎమ్మెల్యేకి నోటి దూల ఎక్కువ అయింది, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉందని.. తనకు వచ్చిన కోపానికి డికాయట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండే వాడు కాదన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Kavya Kalyanram: బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్
వైసీపీ నేతలు, సీఎం మీద తనకేమీ కోపం లేదని పవన్ తెలిపారు. కానీ రౌడీ యిజం, దోపిడీ, కబ్జాలు చేస్తే కచ్చితంగా బాధ్యత గల వారు ఎదురు తిరుగుతారని పవన్ అన్నారు. ఈ వ్యక్తి కుల దూషణతో తమ వాళ్ళను టార్గెట్ చేశారని.. జుట్టు పట్టుకుని, ముట్టుకోని చోట ముట్టుకొని భూతులు తిట్టాడని జనసేనాని అన్నారు. చంద్ర శేఖర్ రెడ్డి తాగి ఒళ్ళు పొగరు ఎక్కి డబ్బులు ఎక్కువ అయ్యి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని దుయ్యబట్టారు. కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించాడని.. రౌడీగాడు తిడతా ఉంటే ఏమి చేయాలో అర్థం కాలేదని పవన్ తెలిపారు. ఇంకోసారి కుల దూషణ చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!